భారత్ వ్యతిరేకులు ఎన్‌కౌంటర్‌‌లో ఖతం : యూపీ మంత్రి

ABN , First Publish Date - 2021-07-22T20:14:58+05:30 IST

భారత దేశానికి వ్యతిరేకంగా నిలిచేవారు ఎన్‌కౌంటర్‌లో అంతమవుతారని

భారత్ వ్యతిరేకులు ఎన్‌కౌంటర్‌‌లో ఖతం : యూపీ మంత్రి

బాలియా : భారత దేశానికి వ్యతిరేకంగా నిలిచేవారు ఎన్‌కౌంటర్‌లో అంతమవుతారని ఉత్తర ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా అన్నారు. ఉర్దూ కవి మునావర్ రాణా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి పరిస్థితుల్లో భారత దేశానికి వ్యతిరేకంగా ఎవరు నిలిచినా, ఎన్‌కౌంటర్లో మరణిస్తారన్నారు. 


ఉర్దూ కవి మునావర్ రాణా ఇటీవల మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ మరోసారి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే, తాను రాష్ట్రాన్ని విడిచి వేరొక చోటుకు వెళ్ళిపోవడం గురించి ఆలోచిస్తానని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పాల్గొనడంపై కూడా ఆయన ప్రశ్నించారు. ఇటువంటి పార్టీలు కేవలం మతపరంగా ఓటర్లను పోలరైజ్ చేయాలని కోరుకుంటాయన్నారు. 


ఈ నేపథ్యంలో మంత్రి శుక్లా మీడియాతో మాట్లాడుతూ, మునావర్ రాణా ప్రముఖ కవి అని, 1947లో దేశ విభజన అనంతరం మన దేశంలోనే ఉన్నవారిలో ఆయన ఒకరని, వీరు  దేశంలో ఉంటూనే దేశాన్ని ముక్కలు చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో భారత దేశానికి వ్యతిరేకంగా నిలిచినవారు ఎన్‌కౌంటర్‌లో మరణిస్తారన్నారు. 


Updated Date - 2021-07-22T20:14:58+05:30 IST