డెల్టా వేరియంట్పై డబ్ల్యూహెచ్వో ఆందోళన
ABN , First Publish Date - 2021-06-23T22:42:34+05:30 IST
భారత్లో తొలిసారి వెలుగు చూసిన డెల్టా వేరియంట్పై ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన కనబరిచింది.
జెనీవా: భారత్లో తొలిసారి వెలుగు చూసిన డెల్టా వేరియంట్పై ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన కనబరిచింది. ఈ వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్వో హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న మైక్ ర్యాన్ మాట్లాడారు. డెల్టా వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోందని, చాలా తీవ్రంగా కూడా ఉందని చెప్పిన ఆయన.. బాగా బలహీనంగా ఉన్న వారిపై ఈ వేరియంట్ దాడి చేస్తోందని తెలిపారు. ఇలా టార్గెట్ చేస్తూ వెళ్లి చివరగా తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యే వ్యక్తులను, ఇంకా తీవ్రంగా ఉంటే మృత్యువాత పడే వారికి ఈ వైరస్ సోకుతుందని మైక్ వివరించారు. భారత్లో వెలుగు చూసిన ఈ వేరియంట్ను ఇప్పటికే వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా కూడా ఈ వేరియంట్ను ప్రమాదకారిగా పేర్కొంది.