మోదీపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసల జల్లు
ABN , First Publish Date - 2020-09-28T02:15:15+05:30 IST
మోదీపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ప్రశంసించారు. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ సరఫరాపై ప్రధాని నరేంద్ర మోదీ హామీని ఆయన ప్రశంసించారు. కోవిడ్-19తో పోరాటంలో ప్రపంచ దేశాలకు భారతదేశం సహాయపడుతోందని మోదీ చెప్పారు. టీకా ఉత్పత్తి సామర్థ్యం, మంచి కోసం వనరులను సమీకరించడం ద్వారా మాత్రమే మహమ్మారిని ఓడించవచ్చన్నారు. శనివారం జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన మోడీ, “ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తి చేసే దేశంగా నేను ఈ రోజు ప్రపంచ సమాజానికి మరో హామీ ఇవ్వాలనుకుంటున్నానని మోదీ చెప్పారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మానవాళి అందరికీ సహాయపడటానికి భారతదేశం యొక్క టీకా ఉత్పత్తి, డెలివరీ సామర్థ్యం ఉపయోగించబడుతుందని మోదీ అన్నారు.
మన వద్ద ఉన్న వనరులను కలిసికట్టుగా సమీకరించడం ద్వారానే కరోనాకు ముగింపు పలకవచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు.