ట్రిపుల్ రైడింగ్పై కొరడా
ABN , First Publish Date - 2020-09-21T07:51:06+05:30 IST
వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ వెళ్లే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో
ఒకే రోజు 895 కేసులు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ వెళ్లే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఒకే రోజు 895 ద్విచక్రవాహనాలను పట్టుకున్నారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తు న్నట్లు ఆధారాలు సేకరించి, వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ట్రిపుల్ రైడింగ్ ప్రమాదకరమని, ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలు ఇలాంటి ప్రమాదకర డ్రైవింగ్ వల్లనే జరిగాయని సీపీ అంజనీకుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు.