మొబైల్‌లో మాట్లాడుతూ నడుస్తున్న మహిళ.. చూసుకోకపోవడంతో క్షణాల్లోనే దారుణం!

ABN , First Publish Date - 2022-02-14T22:21:38+05:30 IST

ఆమె మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ పొలంలో నడుస్తోంది.. మాటల్లో పడి పరిసరాలను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది.

మొబైల్‌లో మాట్లాడుతూ నడుస్తున్న మహిళ.. చూసుకోకపోవడంతో క్షణాల్లోనే దారుణం!

ఆమె మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ పొలంలో నడుస్తోంది.. మాటల్లో పడి పరిసరాలను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది.. అలా నడుస్తూ ఓ దిగుడు బావిలో పడిపోయింది.. ఆమె గురించి వెతికి వెతికి చివరకు బావిలో చూడగా విగత జీవిలా కనిపించింది.. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


హిసార్ జిల్లాలో సిర్సాకు చెందిన మహిళ సునీత గతేడాది రోహ్‌తాష్ అనే యువకుడిని వివాహం చేసుకుంది. రోహ్‌తాష్ తన భూమిలో వ్యవసాయం చేస్తుంటాడు. సునీత కూడా తరచుగా పొలంలోకి వెళుతుంటుంది. ఆదివారం ఉదయం సునీత ఫోన్‌లో మాట్లాడుకుంటూ పొలంలో నడుస్తోంది. ఫోన్ మాట్లాడడంలో మునిగిపోయి ఎదురుగా ఉన్న దిగుడు బావిని చూసుకోకుండా అందులో పడిపోయింది. అది 15 అడుగుల లోతు ఉండడంతో ఆమె ప్రాణాలు విడిచింది. 


ఆమె పొలానికి వచ్చినట్టు తెలుసుకున్న భర్త చుట్టుపక్కల వాళ్లతో కలిసి అంతా గాలించాడు. చివరకు బావిలో చూడగా ఆమె మృతదేహం కనిపించింది. వెంటనే రోహ్‌తాష్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. 

Updated Date - 2022-02-14T22:21:38+05:30 IST