కరోనా తాకని ప్రాంతాలు ఇవే.. డబ్ల్యూహెచ్ఓ ప్రకటన
ABN , First Publish Date - 2022-02-18T23:51:10+05:30 IST
రెండేళ్ల పాటు విడతల వారీగా దాడి చేసిన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని పొట్టనపెట్టుకుంది. ఈ గణాంకాలు చూసిన వారెవరైనా సరే.. కరోనా చేరని ప్రాంతం లేదనే అంచనాకు వస్తారు. అయితే..
ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల పాటు విడతల వారీగా దాడి చేసిన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని పొట్టనపెట్టుకుంది. ఈ గణాంకాలు చూసిన వారెవరైనా సరే.. కరోనా చేరని ప్రాంతం లేదనే అంచనాకు వస్తారు. అయితే.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలను కరోనా తాకలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ జాబితాను వెలువరించింది. ఇందులో.. టువాలు, టోకెలావ్, సెయింట్ హెలీనా, పిట్కెయిర్న్, న్యీయూ, నువారూ, మైక్రోనేషియా, టుర్కెమినిస్థాన్ ఉత్తరకొరియా దేశాల ప్రభుత్వాలు ఒక్క కరోనా కేసు కూడా నమోదైనట్టు ప్రకటించలేదని పేర్కొంది. కాగా.. ప్రస్తుతం ఒమైక్రాన్ వేవ్ నెమ్మదిస్తున్న నేపథ్యంలో అనేక దేశాలు కరోనా ఆంక్షలను సడలిస్తున్నాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.