కొవిడ్ నిబంధనలు ఎక్కడ..?
ABN , First Publish Date - 2021-06-15T04:56:25+05:30 IST
ఒక వైపు కరోనా విజృంభిస్తున్నా మరో వైపు నిబంధనలు ఉల్లంఘించి జనం గుంపులు గుంపులుగా గుమికూడుతున్నారు.
ఎర్రగుంట్ల, జూన్ 14: ఒక వైపు కరోనా విజృంభిస్తున్నా మరో వైపు నిబంధనలు ఉల్లంఘించి జనం గుంపులు గుంపులుగా గుమికూడుతున్నారు. ఇలా అయితే కరోనా రాదా? అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ఎర్రగుంట్ల పట్టణంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద, బ్యాంకుల వద్ద ఎస్బీఐ సోమవారం ఖాతాదారులు గుంపులు గా ఉండడం గమనార్హం.
సడలింపులు దుర్వినియోగం
ప్రొద్దుటూరు అర్బన్, జూన్ 14 : నాలుగు రోజులుగా కర్ఫ్యూ వేళలను మధ్యాహ్నం 2గంటల వరకు సడలించడంతో వ్యా పార కార్యలాపాలు పెరిగాయి. దీంతో సోమవారం కొర్రపాడు రోడ్డులోని ప్రొద్దుటూరు జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయం జనంతో కిటకిటలాడింది. రిజిస్టర్లు చేయించుకోవడానికి కొవిడ్ నిబంధనలు సైతం ఉల్లంఘించి కార్యాలయంలోకి వెళ్ళడానికి తోపులాడుకుంటున్నారు.