Rajasthan: కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీసిన మహిళ.. గంటన్నర తర్వాత ఆమె కళ్లు తెరిచి చూసే సరికి..

ABN , First Publish Date - 2022-09-24T23:18:25+05:30 IST

ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో వెళ్లి తలుపు తీసింది..

Rajasthan: కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీసిన మహిళ.. గంటన్నర తర్వాత ఆమె కళ్లు తెరిచి చూసే సరికి..

ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎవరో కాలింగ్ బెల్  కొట్టడంతో వెళ్లి తలుపు తీసింది.. ఆలయానికి విరాళాలు సేకరిస్తున్నామని ఇద్దరు వ్యక్తులు ఆమెను డబ్బులు అడిగారు.. ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించి లోపలికి వెళుతున్న సమయంలో ఆమెపై మత్తు మందు స్ప్రే చేశారు.. దీంతో ఆమె వరండాలోనే స్పృహ తప్పి పడిపోయింది.. గంటన్నర తర్వాత స్పృహలోకి వచ్చింది.. తన శరీరం మీద బంగారం పోయినట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


ఇది కూడా చదవండి..

దారుణం.. పుట్టింటి నుంచి రానన్న భార్యపై భర్త ఆగ్రహం.. ఎంత క్రూరంగా ప్రవర్తించాడంటే..


రాజస్థాన్‌ (Rajasthan)లోని జైపూర్ నివాసి సురేంద్ర శర్మ భార్య మమత (28) బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇద్దరు యువకులు ఆమె ఇంటి బెల్ కొట్టారు. కొద్ది సేపటికి మమత గేటు తెరిచింది. ఆలయానికి విరాళాలు సేకరిస్తున్నామని, నూనె, రూ.1100 ఇవ్వాలని ఆ యువకులు అడిగారు. డబ్బులు ఇచ్చేందుకు మమత నిరాకరించి తలుపు మూయడం ప్రారంభించింది. ఆ సమయంలో మమతపై ఆగంతకులు మత్తుమందు చల్లారు. దీంతో మమత స్పృహ తప్పి పడిపోయింది. దీంతో యువకులిద్దరూ ఆమె చెవు దిద్దులు, బంగారు గొలుసు పట్టుకుని పారిపోయారు. 


దాదాపు గంటన్నర పాటు మమత ఇంటి వరండాలో అపస్మారక స్థితిలో పడి ఉంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఆమెకు స్పృహ వచ్చింది. చెవి దుద్దులు, బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో ఆమె వెంటనే చోరీ జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2022-09-24T23:18:25+05:30 IST