Atrocity on woman: అటవీ ప్రాంతంలో వివస్త్రగా పడి ఉన్న మహిళ.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఏం జరిగిందని ఆరాతీయగా..
ABN , First Publish Date - 2022-08-06T00:21:11+05:30 IST
మహిళలను చూడగానే కొందరు మానవ మృగాళ్లలా ప్రవర్తిస్తుంటారు. ఎప్పుడెప్పుడు మోసం చేద్దామా అని ఎదురు చూస్తుంటారు. ఏమాత్రం అవకాశం దొరికినా తమలోని శాడిజాన్ని చూపిస్తుంటారు...
మహిళలను చూడగానే కొందరు మానవ మృగాళ్లలా ప్రవర్తిస్తుంటారు. ఎప్పుడెప్పుడు మోసం చేద్దామా అని ఎదురు చూస్తుంటారు. ఏమాత్రం అవకాశం దొరికినా తమలోని శాడిజాన్ని చూపిస్తుంటారు. మహారాష్ట్రలో (Maharashtra) ఓ మహిళ విషయంలో దారుణం జరిగింది. అటవీ ప్రాంతంలో ఓ మహిళ వివస్త్రగా పడి ఉందని సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చివరకు విచారణ చేయగా షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర గోండియా జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 35ఏళ్ల ఓ మహిళ.. భర్తతో విభేదాల కారణంగా చాలా కాలంగా గోరేగావ్లోని సోదరి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో జూలై 30న సోదరితో గొడవ పడింది. దీంతో తల్లి వద్దకు వెళ్లేందుకు అక్కడి నుంచి రాత్రి వేళ బయలుదేరింది. బస్సు కోసం వేచి చూస్తుండగా.. దర్శన్ అనే వ్యక్తి అక్కడికి కారులో వచ్చాడు. తాను తీసుకెళ్తానని చెప్పి ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. అయితే అక్కడికి తీసుకెళ్లకుండా మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను అటవీ ప్రాంతానికి (Forest area) తీసుకెళ్లారు. రాత్రంతా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
young woman Kidnapped: ప్లీజ్ వద్దంటూ వేడుకుంటున్నా.. వినిపించుకోని యువకులు.. ఇంట్లోకి వచ్చి యువతిని బలవంతంగా..
అంతటితో ఆగకుండా చిత్రహింసలకు గురి చేశారు. 31వ తేదీన అటవీ ప్రాంతంలో ఓ మహిళ వివస్త్రగా పడి ఉంది.. అని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలను (CC camera) పరిశీలించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.