భర్త శవం ముందు గుండెలు పగిలేలా ఏడుస్తున్న భార్య.. ఆమెపై డౌట్తో ఇంటి ముందున్న సీసీటీవీ చెక్ చేస్తే..
ABN , First Publish Date - 2021-07-16T17:18:49+05:30 IST
ఒళ్లంతా కాలిన గాయాలతో చనిపోయిన భర్త.. మృతదేహం ముందు గుండెలు పగిలేలా ఏడుస్తున్న భార్య..
ఒళ్లంతా కాలిన గాయాలతో చనిపోయిన భర్త.. మృతదేహం ముందు గుండెలు పగిలేలా ఏడుస్తున్న భార్య.. బంధువుల ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు.. దీంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం కనిపెట్టేశారు.. భర్తను అత్యంత కిరాతకంగా భార్యే చంపిందని తేల్చారు.. ఫరీదాబాద్లో ఈ ఘటన బుధవారం జరిగింది.
ఫరీదాబాద్కు చెందిన సుమిత్కు కొద్ది రోజుల కిందట వివాహం జరిగింది. అయితే సుమిత్ భార్య అప్పటికే తన కజిన్ సందీప్తో ప్రేమలో ఉంది. సుమిత్ను వివాహం చేసుకున్న తర్వాత కూడా సందీప్తో ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేది. ఈ విషయం సుమిత్కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఇద్దరూ తరచుగా గొడవపడేవారు. అయినా ఆమె సందీప్ను కలవడం మానలేదు. దీంతో ఇటీవల పెద్ద గొడవ జరిగింది. దీంతో ఆమె తన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది.
గత బుధవారం లీటర్ కిరోసిన్ బాటిల్ కొని ఇంట్లో ఉంచింది. భర్త బెడ్రూమ్లో పడుకున్న తర్వాత తన ప్రియుడు సందీప్ను ఇంటికి పిలిపించింది. ఇంట్లో నిద్రపోతున్న సుమిత్ శరీరంపై ఇద్దరూ కలిసి కిరోసిన్ పోసి నిప్పంటించి అతను బయటకు రాకుండా బెడ్రూమ్ తలుపు వేసేశారు. శరీరమంతా కాలిపోవడంతో సుమిత్ అక్కడిక్కడే మరణించాడు. సుమిత్ మరణం విషయం తెలుసుకున్న అతని సోదరుడు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఇంటికి ఎదురుగా ఎదురింటి వాళ్లు ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ కెమేరా ఫుటేజ్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. అర్ధరాత్రి సమయంలో ప్రియుడు రావడం, ఇద్దరూ కలిసి కిరోసిన్ పోసి నిప్పంటించి బయట గొళ్లెం బిగించడం, ఆ తర్వాత అతడు వెళ్లిపోవడం వంటివి రికార్డ్ అయ్యాయి. దీంతో సందీప్ను, సుమిత్ భార్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.