రాత్రి 2.30 గంటలు.. పడుకోకుండా అలా నిలబడ్డావేంటని ప్రశ్నించిన తల్లి.. కూతురి నుంచి నో రెస్పాన్స్.. దగ్గరకు వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-09-11T21:26:27+05:30 IST

రాత్రి 2.30 గంటలు.. నిద్రలో నుంచి లేచిన మహిళకు పక్కన కూతురు కనిపించలేదు.. దీంతో కూతురి కోసం ఇల్లంతా వెతికింది..

రాత్రి 2.30 గంటలు.. పడుకోకుండా అలా నిలబడ్డావేంటని ప్రశ్నించిన తల్లి.. కూతురి నుంచి నో రెస్పాన్స్.. దగ్గరకు వెళ్లి చూస్తే..

రాత్రి 2.30 గంటలు.. నిద్రలో నుంచి లేచిన మహిళకు పక్కన కూతురు కనిపించలేదు.. దీంతో కూతురి కోసం ఇల్లంతా వెతికింది.. ఓ గదిలో కూతురు నిలబడి ఉంది.. దీంతో ఊపిరి పీల్చుకున్న తల్లి.. `పడుకోకుండా అలా నిలబడ్డావేంటి` అని ప్రశ్నించింది.. ఆ ప్రశ్నకు కూతురు నుంచి సమాధానం రాలేదు.. దీంతో దగ్గరకు వెళ్లి కూతురిని చూసిన తల్లి బిగ్గరగా అరిచింది.. కూతురు తన చున్నీతో ఉరి వేసుకుని ఉండడడమే ఆమె అరుపునకు కారణం.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. 


విదిశ నర్సింగ్ కాలేజికి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ప్రేమలత, తన కూతురి యశి, భర్తతో కలిసి భైరాగఢ్‌లో నివసిస్తోంది. శుక్రవారం రాత్రి వారు ముగ్గురూ డిన్నర్ పూర్తి చేసి నిద్రపోయారు. తల్లి, కూతురు ఒక గదిలో, తండ్రి వేరే గదిలో నిద్రపోయారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ప్రేమలత నిద్రలో నుంచి లేచి చూసేసరికి యశి ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె కోసం ఇల్లంతా వెతికింది. ఒక గదిలో యశి నిలబడి కనిపించింది. దీంతో ప్రేమలత ఆమెను `పడుక్కోకుండా ఇక్కడేం చేస్తున్నావ`ని అడిగింది. 


ఇవి కూడా చదవండి

షాపులో కౌంటర్‌పైకి సడన్‌గా దూకిన ఆరు అడుగుల పాము.. ఆ కుర్రాడి వెన్నులో వణుకు..




భర్త ఆఫీసుకు వెళ్లాడనుకుని ప్రేయసిని కలిసేందుకు నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడా ప్రియుడు.. చివరకు కథ అడ్డం తిరిగిందిలా..!


యశి నుంచి సమాధానం లేకపోవడంతో గదిలోకి వెళ్లి లైటు వేసి చూసింది. కూతురు ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. దీంతో ప్రేమలత బిగ్గరగా అరిచింది. ఆ అరుపు విన్న ఆమె భర్త అక్కడకు వచ్చి చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. యశి స్నేహితులను, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. 

Updated Date - 2021-09-11T21:26:27+05:30 IST