నరసన్న డార్మెటరీ హాల్ ప్రారంభమెప్పుడో!
ABN , First Publish Date - 2021-08-02T16:27:47+05:30 IST
కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి..
నిర్మాణం పూర్తయి మూడేళ్లు
ప్రారంభిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందంటున్న గ్రామస్థులు
కోరుకొండ: కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ.35 లక్షలు వెచ్చించి మూడేళ్ల క్రితం నిర్మించిన డార్మెటరీ హాల్ను ఎప్పుడు ప్రారంభిస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన నరసన్న దేవస్థానానికి సంబంధించి భక్తులకు ఇంతవరకు ఎటువంటి వసతి సౌకర్యం లేదు. ఈ నేపఽథ్యంలో భక్తుల సౌకర్యార్థం 2018 ఏప్రిల్లో అన్నవరం దేవస్థానం వారు డార్మెటరీ హాల్ నిర్మాణానికి రూ.35 లక్షలు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. అదే సంవత్సరం నిర్మాణం కూడా పూర్తయింది. మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు డార్మె టరీ హాల్ను ప్రారంభించకపోవడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచే స్తున్నారు. దూర ప్రాంతాల నుంచి కోరుకొండ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రస్తుతం ఎలాంటి వసతి సౌకర్యం లేదని, డార్మెటరీ హాల్ ప్రారంభిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు. ఇప్పటికైనా అన్నవరం దేవస్థానం అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని డార్మెటరీ హాల్ ప్రారంభానికి ఉన్న అడ్డంకులు తొలగించాలని భక్తులు కోరుతున్నారు.