యువతితో కలిసున్న ఫొటోతో వాట్సప్‌ స్టేటస్‌.. భార్య చూసి...

ABN , First Publish Date - 2021-04-22T17:08:25+05:30 IST

ఒక యువతితో కలిసి ఉన్న ఫొటోను వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టాడు. గమనించిన అతని భార్య ...

యువతితో కలిసున్న ఫొటోతో వాట్సప్‌ స్టేటస్‌.. భార్య చూసి...

హైదరాబాద్ : మల్కాజిగిరి ప్రశాంత్‌గర్‌ నివాసి రాకేష్‌ రైల్వే ఉద్యోగి. ఉదయం డ్యూటీకి సికింద్రాబాద్‌లోని కార్యాలయానికి వెళ్లాడు. 10.30 గంటల సమయంలో ఒక యువతితో కలిసి ఉన్న ఫొటోను వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టాడు. గమనించిన అతని భార్య అశ్వని రాకేష్‌కు ఫోన్‌ చేయగా 10 నిమిషాలో ఇంటికి వస్తానని చెప్సి రాలేదు. ఆందోళన చెందిన అశ్విని ఫోన్‌ చేస్తే మొబైల్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది.  తెలిసిన చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అశ్వని పోలీసులకు  ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఇంటికి తిరిగి రాలేదు..

ఆనంద్‌బాగ్ : వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యమయ్యారు. ప్రేమ్‌నగర్‌కు చెందిన మహేష్‌(19) ఈ నెల 19న తన తండ్రికి లంచ్‌బాక్స్‌ ఇచ్చి తిరిగి ఇంటికి రాలేదు. తండ్రి ఫోన్‌  చేయగా మొబైల్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. కుటుంబ సభ్యులు అతని కోసం తెలిసిన చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి దొడ్డి మల్లేష్‌ మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-04-22T17:08:25+05:30 IST