ఏం తింటున్నారనేదీ ముఖ్యం!

ABN , First Publish Date - 2021-04-07T05:30:00+05:30 IST

డైట్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం దరిచేరదని సూచిస్తున్నారు వైద్యులు. మీరు ఆహార నియమాలు పాటించకుంటే ఈ రోజు నుంచే మొదలు పెట్టండి.

ఏం తింటున్నారనేదీ ముఖ్యం!

డైట్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం దరిచేరదని సూచిస్తున్నారు వైద్యులు. మీరు ఆహార నియమాలు పాటించకుంటే ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. 


 ఫైబర్‌ అధికంగా లభించే ఆహారం తీసుకోండి. పొట్ట నిండిన భావన రావడానికి, జీర్ణక్రియ బాగా జరగడానికి ఫైబర్‌ ఉపయోగపడుతుంది.


 తాజా పండ్లు, నట్స్‌, ఆకుకూరలు ఎక్కువగా తినండి. మసాలాలు, వేగించిన పదార్థాలు, వెన్నతో చేసిన ఆహారపదార్థాలు తగ్గించండి. 


 ఎట్టి పరిస్థితుల్లో భోజనం మానేయకూడదు.  సమయానికి భోజనం చేయకపోతే శరీరంలో కొవ్వు  పెరుగుతుంది.  


 ప్రతిరోజు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగండి. దాంతో ఒంట్లోని విషపదార్థాలు బయటకు వెళతాయి.



Updated Date - 2021-04-07T05:30:00+05:30 IST