మాజీ ముఖ్యమంత్రి భద్రతకు దిక్కేది....?

ABN , First Publish Date - 2021-02-27T05:12:38+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత మాకు సంబంధం లేదని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం హాస్యాస్పదమని కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నా రు.

మాజీ ముఖ్యమంత్రి భద్రతకు దిక్కేది....?

కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి

 

బద్వేలు, ఫిబ్రవరి 26: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత మాకు సంబంధం లేదని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం హాస్యాస్పదమని కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం చెన్నకేశంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బద్వేలు చైర్మన్‌ గిరిని టీడీపీ సాధిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే తమకు ప్రచార అస్ర్తాలని, నవరత్నాలు రాలిపోతున్నాయన్నారు. మున్సిపాలిటీలో అద్దె ఆధారిత ఇంటిపన్ను ఉండగా ప్రస్తుత ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ ఆధారిత పన్ను వసూలు చేస్తోందని   ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అత్యధిక రోజులు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రత మాకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల చెబితే.. ఇక సామాన్యపౌరుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ యువనేత రితే్‌షకుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలో బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఇంటికి రూ.200లకే మంచినీటి సరఫరా కొళాయి కనెక్షన్‌ ఇచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:12:38+05:30 IST