విశాఖలో రాజధాని నిర్మించడంలో ఆంతర్యమేంటి: కాల్వ
ABN , First Publish Date - 2020-07-04T22:54:39+05:30 IST
విశాఖలో రాజధాని నిర్మించడంలో ఆంతర్యమేంటి: కాల్వ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. రాయదుర్గం టీడీపీ ఆఫీసులో కాల్వ శ్రీనివాసులు దీక్ష చేపట్టారు. మహిళలు ముందుండి అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాయలసీమ ప్రజలకు రాజధానిని దూరం చేసే హక్కు సీఎం జగన్కు ఎవరిచ్చారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఎవరూ కోరని విశాఖలో రాజధాని నిర్మించడంలో ఆంతర్యమేంటి అని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.