మదరసాల్లో National Anthem తప్పనిసరిపై కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-05-14T18:30:13+05:30 IST

యూపీలోని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేసిన తర్వాత సమస్య ఏమిటని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్‌ ప్రశ్నించారు....

మదరసాల్లో National Anthem తప్పనిసరిపై కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ వ్యాఖ్యలు

లక్నో(ఉత్తరప్రదేశ్): యూపీలోని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేసిన తర్వాత సమస్య ఏమిటని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్‌ ప్రశ్నించారు.అన్ని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేస్తూ యూపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘స్వాతంత్య్ర పోరాటంలో జాతీయ గీతం, వందేమాతరం ఆలపించి ప్రజలు తమ ప్రాణాలను అర్పించారు. కాబట్టి ఈ రోజు జాతీయ గీతం పాడటానికి ఎందుకు ఇబ్బంది?ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారో ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నిరంజన్ చెప్పారు.


సాథ్వీ ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు కాన్పూరుకు వచ్చారు.మార్చి 24న జరిగిన యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, యూపీ మైనారిటీ రాష్ట్ర మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.వారణాసి కోర్టు ఆదేశించిన కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్‌వాపి మసీదు సముదాయం సర్వే గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ,‘‘ఆలయాన్ని పడగొట్టి మసీదు నిర్మించకపోతే, వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?’’ అని మంత్రి ప్రశ్నించారు.


Read more