విశాఖ : ఆరుగురి దారుణ హత్యకు కారణమిదేనా!?

ABN , First Publish Date - 2021-04-15T16:21:43+05:30 IST

ఇవాళ జరిగిన వరుస ఘటనలతో విశాఖ వాసులు ఉలిక్కిపడుతున్నారు.

విశాఖ : ఆరుగురి దారుణ హత్యకు కారణమిదేనా!?

విశాఖపట్నం : జిల్లాలో ఇవాళ జరిగిన వరుస ఘటనలతో విశాఖ వాసులు ఉలిక్కిపడుతున్నారు. ఒక చోట ఆరుగురు.. మరో చోట నలుగురు అనుమానస్పదంగా మొత్తం 10 మంది ఒకే రోజు మృతి చెందడంతో జిల్లాలో అసలేం జరుగుతోంది..? అని జనాలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఆరుగురి హత్య కేసులో తాజాగా అందిన సమాచారం మేరకు.. ఆస్తి కోసం జరిగిన వివాదంలో అప్పలరాజు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని తేలింది. మరోవైపు మృతుల బంధవులు సైతం ఈ హత్యలు ఆస్తి కోసమే జరిగాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం ఘర్షణలు జరుగుతున్నాయని బంధవులు చెబుతున్నారు. హంతకుడు అప్పలరాజును తమ ముందుకు తెచ్చేవరకూ మృతదేహాలను ఇక్కడ నుంచి కదలనివ్వమని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అప్పలరాజును రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలియవచ్చింది.


కాగా.. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులు ఉషా(31),రమాదేవి(45),అరుణ (40), రవణ (55) చిన్నారులు ఉదయ్ (02), ఆదిలక్ష్మి (6 నెలలు)గా పోలీసులు గుర్తించారు. విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఘటనపై డీసీపీ సురేష్ బాబు, ఏసీపీ శ్రీపాదరావు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-04-15T16:21:43+05:30 IST