భార్య ప్రేమతో అడిగిందని బైక్లో బయటికి తీసుకెళ్లాడు.. ఉన్నట్టుండి మధ్యలో బండికి పంక్చర్.. అంతలోనే..
ABN , First Publish Date - 2022-02-04T23:17:01+05:30 IST
‘‘ఏవండీ అలా సరదాగా బయటికెళ్లొద్దామండీ’’.. అంటూ ఆ నవ వధువు, భర్తను కోరింది. భార్య ఎంతో ప్రేమతో అడగడంతో కాదనలేక బైక్పై బయటికి తీసుకెళ్లాడు. పర్యాటక ప్రదేశాలు చూపిద్దామని ఆశతో వెళ్తుండగా.. మధ్యలో..
‘‘ఏవండీ అలా సరదాగా బయటికెళ్లొద్దామండీ’’.. అంటూ ఆ నవ వధువు, భర్తను కోరింది. భార్య ఎంతో ప్రేమతో అడగడంతో కాదనలేక బైక్పై బయటికి తీసుకెళ్లాడు. పర్యాటక ప్రదేశాలు చూపిద్దామని ఆశతో వెళ్తుండగా.. మధ్యలో బండి పంక్చరయింది. దీంతో నిరాశగానే బండిని తోసుకుంటూ వెళ్తున్నారు. భర్తలో నిరాశ ఉన్నా.. భార్య మాత్రం ఆనందంగా ఉంది. అంతా ఆమె అనుకున్నట్లే జరుగుతోందని సంబరపడుతోంది. ఇంతలో అక్కడ జరిగిన ఘటన అందరినీ షాక్కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే..
చెన్నై తేని జిల్లా కంభం కురంగ్మయాన్ ప్రాంతానికి చెందిన గౌతమ్కు.. అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరి(21)తో వివాహమైంది. అప్పటికే భువనేశ్వరి పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఇంతలో ఆమెకు ఇష్టం లేకుండానే వివాహం జరిగిపోయింది. పెద్దల ముందు నోరు మెదపలేక అసంతృప్తిగానే అత్తగారింట్లోకి అడుగుపెట్టింది. వివాహమైన కొన్నాళ్లకు ఆమెకు కంభం సమీపంలోని గోవిందంపట్టి ప్రాంతానికి చెందిన నిరంజన్తో స్నేహం కుదిరింది. తనకు ఇష్టం లేకుండానే పెళ్లి చేశారన్న విషయాన్ని నిరంజన్ వద్ద అప్పుడప్పుడూ ప్రస్తావిస్తూ ఉండేది. అయితే పెళ్లయి 23రోజులు కూడా కాకుండానే ఆమెకు భర్తపై విరక్తి పెరిగింది. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నింది. ఇదే విషయాన్ని తన స్నేహితుడికి తెలిపింది.
భార్యాభర్తలిద్దరూ పార్టీ చేసుకున్నారు.. ముక్కలు కూడా సిద్ధం చేసుకున్నారు.. మందు తాగుతూ చివరగా భార్యతో ఇలా అన్నాడు..
పథకం ప్రకారం భర్తను బయటికి తీసుకెళ్లింది. మధ్యలో బైకు పంక్చర్ అవడంతో.. తోసుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో వెనుక నుంచి భువనేశ్వరి స్నేహితుడు.. కొంతమందితో కలిసి కారులో వచ్చి గౌతమ్ను ఢీకొని, అక్కడి నుంచి పరారయ్యారు. అయితే వెంటనే గౌతమ్ అప్రమత్తమవడంతో గాయాలతో బయటపడ్డాడు. కారు నంబర్ను ఫొటో తీసి, పోలీసులకు పంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
మూడో వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ.. సంతోషంగా ఉండకుండా.. ప్రియుడితో కలిసి ఇలా చేస్తుందనుకోలేదు..
భర్త హత్యకు ప్లాన్ చేసిన భువనేశ్వరి.. బ్యాంకులో బంగారం కుదువ పెట్టి, నిరంజన్కు రూ.75,000 ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు, తన పేరు ఎలాగైనా బయటికి వస్తుందన్న భయంతో.. భువనేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు నిరంజన్, ప్రదీప్, మనోజ్ కుమార్, ఆల్బర్ట్, జయసత్యను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న జైట్లీ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.