అంతరిక్షంలో ఉన్న రాకేశ్ శర్మను ఇందిర ఏమడిగారు?

ABN , First Publish Date - 2021-04-03T18:29:37+05:30 IST

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ.

అంతరిక్షంలో ఉన్న రాకేశ్ శర్మను ఇందిర ఏమడిగారు?

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ. 1984, ఏప్రిల్ 2వ తేదీన సోవియట్‌ యూనియన్‌కు చెందిన `సోయజ్‌ టి-11` వ్యోమ నౌక ద్వారా ఆయన అంతరిక్షంలోకి వెళ్లారు. సోవియట్ ఇంటర్ కాస్మోస్ స్పేస్ ప్రోగ్రామ్, ఇస్రో భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన రాకేశ్ శర్మ 7 రోజుల, 21 గంటల, 40 నిమిషాల పాటు అక్కడ గడిపారు. 


ఈ అద్భుత ఘట్టానికి 36 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ దయానంద్ కాంబ్లే ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. రాకేశ్ శర్మ, ఇందిర మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అంతరిక్షంలోకి వెళ్లిన రాకేశ్ శర్మ అక్కడి నుంచే జాయింట్ టెలివిజన్ న్యూస్ కాన్ఫరెన్స్ ద్వారా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో మాట్లాడారు. `అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తోంది` అని రాకేశ్‌ను ఇందిర ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు రాకేశ్ `సారే జహాసె అచ్చా` (మిగతా ప్రపంచం కంటే ఉన్నతంగా) అని బదులిచ్చారు.



Updated Date - 2021-04-03T18:29:37+05:30 IST