Viral Video: రైలు దగ్గరికి వస్తుందనగా మహిళను పట్టాల మీదకు తోసేసిన యువకుడు.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-01-18T03:23:07+05:30 IST

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ రైలు కోసం ఎదురు చూస్తోంది. రైలు దగ్గరికి వస్తుందనగా.. ఓ యువకుడు ఆమెను పట్టాల మీదకు తోసేశాడు. ఊహించని ఘటనతో..

Viral Video: రైలు దగ్గరికి వస్తుందనగా మహిళను పట్టాల మీదకు తోసేసిన యువకుడు.. చివరకు ఏమైందంటే..

కొందరు నేరస్థులు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. హత్యలు, అత్యాచారాలు చేసినా.. తమకేమీ తెలీనట్లు ప్రవర్తిస్తుంటారు. అయితే కొన్నిసార్లు చివరకు ఏదో రకంగా దొరికిపోతుంటారు. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ రైలు కోసం ఎదురు చూస్తోంది. రైలు దగ్గరికి వస్తుందనగా.. ఓ యువకుడు ఆమెను పట్టాల మీదకు తోసేశాడు. ఊహించని ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.


బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ మీద రైలు కోసం ప్రయాణికులంతా ఎదురు చూస్తున్నారు. వారితో పాటూ ఓ మహిళ కూడా ఎదురుచూస్తోంది. ఆమె వెనుక ఓ యువకుడు అటూ ఇటూ తిరుగుతూ ఉండడం వీడియోలో గమనించవచ్చు. అయితే అందరిలా అతను కూడా రైలు కోసం ఎదురు చూస్తున్నాడేమో అని అంతా అనుకుంటారు. అయితే తీరా రైలు దగ్గరికి వచ్చే సమయంలో ఆమెను వెనుక నుంచి పట్టాల మీదకు తోసేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అదృష్టవశాత్తు రైలును సడన్‌గా ఆపడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చికెన్ తెస్తానని వెళ్లి.. సాయంత్రానికి కోటీశ్వరుడయ్యాడు.. దెబ్బకు ఈ పెయింటర్ రాతే మారిపోయింది..



Updated Date - 2022-01-18T03:23:07+05:30 IST