ప్రియుడు అందుకు ఒప్పుకోలేదని కోపం పెంచుకుంది... ఓ రోజు అర్ధరాత్రి అతడి ఇంటికి వెళ్లి ఆమె ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-02-11T00:06:52+05:30 IST

భర్త ఉన్నాడన్న స్పృహ లేకుండా.. కుటుంబ బాధ్యతలను పక్కనపెట్టి పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. భవిష్యత్తులో తలెత్తే పరిణామాల గురించి ఆలోచించడమే మానేసి.. నిత్యం ప్రియుడి ఆలోచనలోనే..

ప్రియుడు అందుకు ఒప్పుకోలేదని కోపం పెంచుకుంది... ఓ రోజు అర్ధరాత్రి అతడి ఇంటికి వెళ్లి ఆమె ఏం చేసిందంటే..
లక్ష్మి

భర్త ఉన్నాడన్న స్పృహ లేకుండా.. కుటుంబ బాధ్యతలను పక్కనపెట్టి పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. భవిష్యత్తులో తలెత్తే పరిణామాల గురించి ఆలోచించడమే మానేసి.. నిత్యం ప్రియుడి ఆలోచనలోనే గడిపేది. తన కుటుంబ బాధ్యతలు పక్కన పెట్టిన ఆమె.. కనీసం తన ప్రియుడికి కూడా ఒక కుటుంబం ఉంటుందనే విషయాన్ని కూడా పట్టించుకోలేదు. తాను అడిగినదానికి ఒప్పుకోలేదనే కారణంతో కోపం పెంచుకుంది. ఓ రోజు అర్ధరాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లి ఆమె చేసిన పని అందరినీ షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌కు చెందిన గంగారామ్ అనే వ్యక్తి.. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి మాండ్యలో స్థిరపడ్డాడు. గంగారామ్.. ప్లాస్టిక్ సామాన్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. వీరి ఇంటికి సమీపంలో ఉండే లక్ష్మి అనే మహిళ.. గంగారామ్‌కు దూరపు బంధువు అవుతుంది. ఈ చనువుతో రోజూ గంగారామ్ ఇంటికి వస్తూ, పోతూ ఉండేది. కొన్నాళ్లకు వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. గంగారామ్ తన భార్యకు తెలీకుండా తరచూ లక్ష్మితో కలుస్తుండేవాడు. కొన్నాళ్లకు ఈ విషయం గంగారామ్ భార్యకు తెలిసింది. ఒకరోజు లక్ష్మిని పిలిచి.. ‘‘ ఇంకోసారి నా భర్తతో మాట్లాడితే బాగుండదు’’.. అంటూ గట్టిగా హెచ్చరించింది. అయితే లక్ష్మి మాత్రం గంగారామ్‌ను మర్చిపోలేకపోయింది. ‘‘ఇద్దరం పెళ్లి చేసుకుందాం’’.. అంటూ గంగారామ్‌తో చెప్పగా, అందుకు అతను కూడా అంగీకరించలేదు. దీంతో గంగారామ్ కుటుంబంపై కోపం పెంచుకుంది.

అర్జెంట్ అంటూ కారును ఆపి మరీ టాయ్‌లెట్‌కు వెళ్లిన నవవధువు.. ఎంతకూ రాకపోవడంతో వెళ్లి చూస్తే..


గంగారామ్ భార్యాపిల్లలను చంపేస్తే తనకు ఏ అడ్డూ ఉండదని భావించింది. ఓ రోజు ప్రియుడు లేని సమయంలో అర్ధరాత్రి గంగారామ్ ఇంటికి వెళ్లింది. లక్ష్మిని చూడగానే గంగారామ్ భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలో ఒక్కసారిగా గంగారామ్ భార్యపై కొడవలితో దాడి చేసింది. తర్వాత గంగారామ్ పిల్లలను కూడా హత్య చేసి పారిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా మైసూర్‌లో ఉన్న లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

తప్పు చేస్తున్నావు.. పద్ధతి మార్చుకో.. అంటూ భర్త చెప్పింది విని ఆ భార్యలో మార్పు.. కానీ చివరకు షాకింగ్ సీన్..!

Updated Date - 2022-02-11T00:06:52+05:30 IST