రైలు పైకప్పుపై ఉబ్బెత్తుగా సర్కిల్స్ ఎందుకు ఉంటాయి? వాటి వలన కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసా?

ABN , First Publish Date - 2022-01-08T15:42:39+05:30 IST

మీరు రైల్వే స్టేషన్‌లోని వంతెన మీదుగా వెళుతున్నప్పుడు..

రైలు పైకప్పుపై ఉబ్బెత్తుగా సర్కిల్స్ ఎందుకు ఉంటాయి?  వాటి వలన కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసా?

మీరు రైల్వే స్టేషన్‌లోని వంతెన మీదుగా వెళుతున్నప్పుడు కిందనున్న రైళ్లను చూసేవుంటారు. ఆ రైళ్లపైభాగంలో ఉబ్బెత్తుగా సర్కిల్స్ కనిపిస్తాయి. అవేమిటో, దానివలన ప్రయోజనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి ఈ రైలు పైకప్పులపై అమర్చిన ప్లేట్లు లేదా వృత్తాకార ఆకారాలను రూఫ్ వెంటిలేటర్లు అని అంటారు. రైలు కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పుడు లోపలి ఉష్ణోగ్రత  పెరుగుతుంది. వేడి వాతావరణం ఏర్పడి ప్రయాణీకులకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని నివారించేందుకే రైలు పైకప్పులపై రూఫ్ వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తారు. వేడి గాలి ఎప్పుడూ పైకి చేరుకుంటుంది. అందుకే కోచ్ లోపల పైకప్పులపై రంధ్రాలతో కూడిన ప్లేట్లు అమరుస్తారు. ఇక్కడి నుంచి వేడి గాలి కోచ్ నుంచి బయటకు పోతుంది. అయితే ఈ మెష్ పైన ఒక ప్రత్యేకమైన ప్లేట్ ఉంటుంది. ఈ కారణంగా వర్షపు నీరు బోగీ లోనికి చేరదు.

Updated Date - 2022-01-08T15:42:39+05:30 IST