గళమెత్తిన పారిశుధ్య కార్మికులు

ABN , First Publish Date - 2021-06-15T05:28:13+05:30 IST

మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు తమ డిమాండ్ల సాధనకు సమ్మెకు దిగారు. జిల్లా వ్యాప్తంగా మునిసిపాల్టీల్లోని కార్మికులు సోమవారం విధులను భహిష్కరించి, నిరసన చేపట్టారు.

గళమెత్తిన పారిశుధ్య కార్మికులు
బొబ్బిలి పట్టణంలో కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

  మునిసిపాల్టీల్లో రెండు రోజులపాటు సమ్మె 

  మద్దతునిచ్చిన వివిధ పార్టీల నేతలు

మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు తమ డిమాండ్ల సాధనకు సమ్మెకు దిగారు. జిల్లా వ్యాప్తంగా మునిసిపాల్టీల్లోని కార్మికులు సోమవారం విధులను భహిష్కరించి, నిరసన చేపట్టారు. తమను రెగ్యులర్‌ చేయాలనే డిమాండ్‌ చేశారు.  కరోనాతో మృతిచెందిన కార్మికుల కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం అందించాలన్నారు. జీతాలు, హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. రెండు రోజులపాటు సమ్మె నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమ్మెకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. 

(ఆంధ్రజ్యోతి బృందం)

 

Updated Date - 2021-06-15T05:28:13+05:30 IST