తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలి: వర్మ
ABN , First Publish Date - 2020-11-29T05:56:39+05:30 IST
వర్షానికి తడిచిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రభుత్వాన్ని కోరారు.
పిఠాపురం రూరల్, నవంబరు 28: వర్షానికి తడిచిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రభుత్వాన్ని కోరారు. మల్లాం, కందరాడ, భోగాపురం, రాపర్తి, జల్లూరు గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. వర్షానికి పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ తుఫాన్ వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. ఎకరాకు రూ.25వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. జేసీ, కలెక్టర్లు పర్యటిస్తున్నారు తప్పితే ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదన్నారు. రంగు మారిన, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో సకుమళ్ల గంగాధర్, బర్ల అప్పారావు, మలిరెడ్డి వెంకటరణమణ, పిల్లా విశ్వనాథం, శివ, బత్తిన వీరబాబు, ఎద్దు నాగేశ్వరరావు పాల్గొన్నారు.