తొమ్మిది కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-08-02T05:36:08+05:30 IST

పెదవేగి మండలంలో ఆదివారం నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పెదవేగి ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ టీవీఎల్‌.ప్రసన్నకుమార్‌ చెప్పారు.

తొమ్మిది కరోనా పాజిటివ్‌ కేసులు
వెంకటాపురంలో బ్లీచింగ్‌ చేస్తున్న పంచాయతీ సిబ్బంది

పెదవేగి, ఆగస్టు 1 : పెదవేగి మండలంలో ఆదివారం నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పెదవేగి ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ టీవీఎల్‌.ప్రసన్నకుమార్‌ చెప్పారు. ఇప్పటివరకు మండలంలో 1583 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వారిలో హోం ఐసొలేషన్‌లో 1360 మంది ఉండి చికిత్స పూర్తిచేసుకున్నారని, ప్రస్తుతం 82 మంది హోం ఐసొలేషన్‌లో, 104 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇప్పటి వరకు 37 మంది మృతి చెందినట్టు చెప్పారు.

ఏలూరు రూరల్‌ : మండలంలో కొవిడ్‌ కేసులు రోజువారీ వస్తూనే ఉన్నా యి. ఆదివారం ఒక కేసు నమోదైనట్టు మండల వైద్యాధికారి డాక్టర్‌ దేవ్‌ మనోహర్‌ కిరణ్‌ తెలిపారు. ఎక్కువగా ఏలూరు రూరల్‌ మండలం వెంకటా పురం పంచాయతీ పరిధిలో కేసులు నమోదు అవుతున్నట్టు ఎంపీడీవో సరళ కుమారి తెలిపారు. దీంతో ఆగ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. సోడియం హైపో క్లోరైడ్‌తో పిచికారీ  చేసి బ్లీచింగ్‌ చేసి శుభ్రపరిచారు. 

పెదపాడు : పెదపాడు మండలం వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో అప్పన వీడులో రెండు, పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో వీరమ్మకుంటలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యసిబ్బంది తెలిపారు.  

Updated Date - 2021-08-02T05:36:08+05:30 IST