రైలు ఢీకొని మృతి

ABN , First Publish Date - 2021-02-26T04:23:09+05:30 IST

బహిర్భూమికి వెళ్లిన ఒక వ్యక్తి పట్టాలు దాటు తుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందాడు.

రైలు ఢీకొని మృతి

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 25: బహిర్భూమికి వెళ్లిన ఒక వ్యక్తి పట్టాలు దాటు తుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఏలూరు రైల్వే పోలీ సులు తెలిపిన వివరాలివి.. ఏలూరులోని కాకివారి వీధి గంగానమ్మగుడి ప్రాంతానికి చెందిన మీసాల శేఖర్‌ (58) భార్య, కుమా రుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు పిల్లలకు వివా హం కాగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. అతని భార్య హైదరాబాద్‌లోనే ఉంటోం ది. పిల్లలు పంపించే సొమ్ముతో శేఖర్‌ జీవిస్తున్నాడు. బుధవారం నిమ్మకాయల మార్కెట్‌యార్డు సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. అక్కడ పట్టాలు దాడుతుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ సమాచారం రైల్వే పోలీసులకు అందడంతో ఎస్‌ఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో హెడ్‌కానిస్టేబుల్‌ నంబూరి ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహానికి గురువారం ఉదయం ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనుమా నాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు. 

రైలు పట్టాలపై యువకుడి మృతదేహం

 ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో రైలు ప్రమా దంలో మృతి చెందాడు. దెందులూరు మండలం చల్లపల్లికి చెం దిన పరసా నిఖిల్‌సాయి (20) ఏలూరు సమీపంలోని  వట్లూ రు రైల్వే స్టేషన్‌ దగ్గరలో రైలు పట్టాలపై మృతి చెంది ఉన్నాడు. గురువారం ఉదయం ఏలూరు రైల్వే ఎస్‌ఐ చంద్రశేఖర్‌కు స మాచారం అందడంతో సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద ఆధార్‌కార్డు లభించడంతో  అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా అతని తల్లి హైదరాబాద్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. ప్రమా దవశాత్తు రైలు ఢీకొందా, లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాడా తెలియాల్సి ఉంది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానా స్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-02-26T04:23:09+05:30 IST