టీచర్ల బదిలీ.. 60 శాతం మంది విధుల్లో చేరిక

ABN , First Publish Date - 2021-01-16T05:38:23+05:30 IST

బదిలీ ఖరారైన టీచర్లకు ఉత్తర్వుల జారీ కొనసాగుతోంది.

టీచర్ల బదిలీ.. 60 శాతం మంది విధుల్లో చేరిక

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 15 : బదిలీ ఖరారైన టీచర్లకు ఉత్తర్వుల జారీ కొనసాగుతోంది. కోర్టు ఉత్తర్వులతో గ్రేడ్‌ –2 హెచ్‌ఎంల (జిల్లా పరిషత్‌) బదిలీలకు తాజాగా మరో దఫా వెబ్‌ఆప్షన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకు న్నారు. జిల్లాలో 5,699 మంది హెచ్‌ఎంలు, టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసు కున్నారు. వీరిలో ఎస్‌జీటీలు, హెచ్‌ఎంల బదిలీ ఉత్తర్వులు మినహా మిగతా అన్ని క్యాడర్ల టీచర్ల బదిలీ ఉత్తర్వులు గురువారమే జారీ కాగా శుక్రవారానికి దాదాపు 60 శాతం మందికిపైగా టీచర్లు ప్రస్తుత స్థానాల్లో రిలీవై నూతన స్థానాల్లో విధుల్లో చేరినట్టు జిల్లా విద్యా శాఖకు సమాచారం అందింది.  2,986 మంది సెకండరీ గ్రేడు టీచర్ల బదిలీ ఉత్తర్వుల జారీ శనివారంలోపు పూర్తి కా నున్నట్టు సమాచారం అందింది. కాగా తొలివిడత నాడు–నేడు పనులు జరుగు తున్న పాఠశాలల హెచ్‌ఎంల బదిలీకి మార్గదర్శకాలు జారీచేశారు. నూతన పాఠశాలల్లో తక్షణమే చేరాలని రిలీవ్‌ అయిన ఏడు రోజుల్లోగా పూర్వపు పాఠశాలల్లో కొత్తగా విధుల్లో చేరిన హెచ్‌ఎంకు చార్జి అప్పగించాలని కోరారు. 

Updated Date - 2021-01-16T05:38:23+05:30 IST