టీడీపీతోనే భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు

ABN , First Publish Date - 2021-12-06T04:37:55+05:30 IST

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే నేటితరంతో పాటు భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు.

టీడీపీతోనే భావితరాలకు ఉజ్వల  భవిష్యత్తు
కాలనీలో పర్యటిస్తున్న బడేటి చంటి, టీడీపీ నాయకులు

 ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి చంటి 

ఏలూరు రూరల్‌, డిసెంబరు 5 : వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే నేటితరంతో పాటు భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలకు వివరిం చేందుకు ‘గౌరవ సభ’ పేరుతో ఆదివారం కొత్తూరు, వెంకటాపురం పంచాయతీ పరిధిలోని సాయినగర్‌, శివనగర్‌, గణేష్‌ కాలనీల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతు న్నారన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం భారాలు మోపు తోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, అభయ హస్తం పథకంలో పొదుపు చేసిన మహిళలకు సంబంధించిన రెండువేల కోట్ల రూపాయల సొమ్మును జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వాడుకుందన్నారు. ఓటీఎస్‌ పేరుతో ప్రజ లను బెదిరిస్తోందని మండిపడ్డారు. ఎక్కడా లేని విధంగా వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసిందని విమర్శించారు. రాబోయే తరాల కోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు పాలి ప్రసాద్‌, పి.శివప్రసాద్‌, వెంకటరత్నం, దాసరి ఆంజనేయులు, లంకపల్లి మాణిక్యాలరావు, పూజారి నిరంజన్‌, నెరుసు గంగరాజు, మారం హనుమంత రావు, దాకారపు రాజేశ్వరరావు, పెద్దాడ రమణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-06T04:37:55+05:30 IST