అంబేడ్కర్‌ విగ్రహాలకు టీడీపీ నాయకుల పాలాభిషేకం

ABN , First Publish Date - 2021-01-27T05:39:39+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు గ్రామాల్లో భారతరత్న డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు.

అంబేడ్కర్‌ విగ్రహాలకు టీడీపీ నాయకుల పాలాభిషేకం
అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకుల నివాళులు

పెదవేగి, జనవరి 26: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు గ్రామాల్లో భారతరత్న డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. పెదవేగి మండలం అమ్మపాలెం, దుగ్గిరాల గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో టీడీపీ పెదవేగి మండల అధ్యక్షుడు బొప్పన సుధాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమన్నారు. ఫ్యాక్షనిస్టులకు చెంపపెట్టులా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొసరాజు బలరామకృష్ణచౌదరి, చందు శ్రీనివాసరావు, కొఠారి శ్రీరాములు, గరికిముక్కు ఏసుపాదం, మరియదాసు తదితరులు పాల్గొన్నారు.

పెదపాడు: పంచాయతీ ఎన్నికలు జరగడానికి సుప్రీంకోర్టు అనుమతులు ఇవ్వడం రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య విజయమని టీడీపీ కొణికి గ్రామ పార్టీ అధ్యక్షులు పొట్లూరి యుగంధర్‌ అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతి స్తూ, అటువంటి రాజ్యాంగాన్ని రచించిన డాక్టరు బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లావేటి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌ గంపా రాంబ్రహ్మం పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T05:39:39+05:30 IST