ఒడిశా వాసి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-04-11T05:14:31+05:30 IST

ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి అనుమానా స్పద స్థితిలో మృతి చెందాడు.

ఒడిశా వాసి అనుమానాస్పద మృతి

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 10 : ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి అనుమానా స్పద స్థితిలో మృతి చెందాడు. ఏలూరు రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నూజివీడు రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తుతెలియని ఒక మృతదేహం ఉందని ఏలూరు రైల్వే పోలీసులకు శనివారం సమా చా రం అందింది. రైల్వే ఎస్‌ఐ చంద్రశేఖర్‌ సిబ్బందితో ఘట నా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద ఆధార్‌ కార్డు, ఫోన్‌ నెంబర్‌ లభించడంతో మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఒడిశా గజపతి జిల్లా జంగల్‌పాడుకు చెందిన దుష్‌మంత పాత్రో (31)గా గుర్తించారు. రైలు నుంచి జారి పడ్డాడా.. లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా మరే ఇతర కారణాలతో మరణించాడా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభు త్వాస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-04-11T05:14:31+05:30 IST