అప్పుల బాధ తాళలేక.. ఆత్మహత్య !

ABN , First Publish Date - 2021-04-11T05:13:31+05:30 IST

గాలాయగూడెం పంచాయతీ పరిధిలోని నాగు దేవునిపాడుకు చెందిన గోర్ల సత్యనారాయణ (50) కొన్నేళ్లుగా రైస్‌ మిల్‌ను నిర్వ హిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అప్పుల బాధ తాళలేక.. ఆత్మహత్య !

దెందులూరు, ఏప్రిల్‌ 10: గాలాయగూడెం పంచాయతీ పరిధిలోని నాగు దేవునిపాడుకు చెందిన గోర్ల సత్యనారాయణ (50) కొన్నేళ్లుగా రైస్‌ మిల్‌ను నిర్వ హిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా సమయంలో మిల్‌ సరిగా నడవకపోవ డం.. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కావడంతో అప్పులు చేశాడు. వీటిని తీర్చే మార్గం లేక.. తీవ్ర ఒత్తిడి పెరిగి మార్చి 31వ తేదీ ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతన్ని ఏలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అతని బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రామ్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2021-04-11T05:13:31+05:30 IST