ఆర్థిక నేరస్తులపై నిఘా ఉంచండి

ABN , First Publish Date - 2022-01-22T05:04:28+05:30 IST

అమాయక ప్రజలను మోసం చేస్తూ ఆర్థిక నేరా లకు పాల్పడుతున్న నేరస్తులపై గట్టి నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ పోలీసు అధికారులను ఆదేశించారు.

ఆర్థిక నేరస్తులపై నిఘా ఉంచండి

 జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ
ఏలూరుక్రైం, జనవరి 21 : అమాయక ప్రజలను మోసం చేస్తూ ఆర్థిక నేరా లకు పాల్పడుతున్న నేరస్తులపై గట్టి నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ  పోలీసు అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూ ఆర్థికంగా నష్టం కలిగిస్తున్న వారిపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల దర్యాప్తు లో పాటించాల్సిన విషయాలపై సిబ్బంది అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆర్థిక నేరాలపై నమోదు కాబడిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడానికి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల న్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీఆర్‌బీ ఎస్‌ఐ నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:04:28+05:30 IST