మాస్క్‌ లేకుంటే జరిమానా

ABN , First Publish Date - 2021-04-19T05:17:10+05:30 IST

మాస్కులు లేకుండా రోడ్ల పైకి వస్తున్న వారికి జరిమానా విధించాలని జిల్లా ఎస్పీ కె.నారాయణ్‌నాయక్‌ పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

మాస్క్‌ లేకుంటే జరిమానా
వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ

జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 18 : మాస్కులు లేకుండా రోడ్ల పైకి వస్తున్న వారికి జరిమానా విధించాలని జిల్లా ఎస్పీ కె.నారాయణ్‌నాయక్‌ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. వైరస్‌ ప్రజలకు, పోలీసులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  ఆదివారం సాయంత్రం జిల్లాలోని డీఎస్పీ లు, సీఐలతో ఎస్పీ తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి పోలీసుస్టేషన్‌లో కరోనా నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే పోలీసు శాఖకు 30, 144 సీఆర్‌సీపీ సెక్షన్‌లు అమల్లో ఉన్నాయన్నారు. దేవాలయాలు, చర్చ్‌ లు, మసీదుల వద్ద సామూహిక ప్రార్థనల సమయంలో ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఏఎస్పీ సుబ్బరాజు, ఏఆర్‌ ఏఎస్పీ ఎం.మహేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T05:17:10+05:30 IST