కడలి.. కలవరం

ABN , First Publish Date - 2022-05-19T05:48:06+05:30 IST

తీర ప్రాంతంలో సముద్రం కలవరపరుస్తోంది.

కడలి.. కలవరం

– నరసాపురం/ మొగల్తూరు
  తీర ప్రాంతంలో సముద్రం కలవరపరుస్తోంది. ఆసాని తుఫాన్‌ వీడినా సముద్రంలో కల్లోలం ఇంకా తగ్గలేదు. కొద్ది రోజుల నుంచి సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. కేపీ పాలెం వద్ద  బుధవారం పది మీటర్లు, పీఎం లంక, చినలంక వద్ద ఐదు మీటర్లు ముందుకు రావడంతో తీర గ్రామస్థులు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. సాయంత్రం వరకూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇటు బీచ్‌కు వచ్చిన సందర్శకులు దీనిని పెద్దగా పట్టించుకోకుండానే సముద్ర స్నానాలకు దిగారు.  సాధారణంగా పౌర్ణమి, అమావాస్య  ఘడియల్లో సముద్రం ముందుకు రావడం పరిపాటి. కానీ ఇటీవల సాధారణ రోజుల్లోనూ ఇలా జరగడం గ్రామస్థులను కలవరానికి గురిచేస్తోంది.

Updated Date - 2022-05-19T05:48:06+05:30 IST