ప్రేమపేరుతో బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2021-01-16T05:39:53+05:30 IST

ఒక షాపులో పనిచేస్తున్న బాలిక (14)కు ఒక యువకుడు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు.

ప్రేమపేరుతో బాలికపై అత్యాచారం

ఏలూరు క్రైం, జనవరి 15: ఒక షాపులో పనిచేస్తున్న బాలిక (14)కు ఒక యువకుడు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఏలూరు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏలూరులోని ఒక ప్రాంతానికి చెందిన  ఆ బాలిక నగరంలోని ఒక దుకాణంలో పని చేస్తోంది. ఏలూరు గొల్లాయిగూడెంనకు చెందిన మానుకొండ శివదత్త (20) అనే యువకుడు ఆ బాలిక షాపునకు వెళ్ళి వచ్చేటప్పుడు పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వట్లూరు సమీపం లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను ఇటీవల సారా కేసులో అరెస్ట్‌ అయి బయటకు వచ్చాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లితో చెప్పడంతో వన్‌టౌన్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు  శివదత్తపై ఫోక్సోకేసు, అత్యాచారం కేసు నమోదు చేశారు.  

Updated Date - 2021-01-16T05:39:53+05:30 IST