ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు

ABN , First Publish Date - 2021-04-17T05:06:35+05:30 IST

రంజాన్‌ పర్వదినం మొదటి శుక్రవారం ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో అల్లాని ప్రార్థిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు
ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

 ఏలూరు కల్చరల్‌,  ఏప్రిల్‌ 16:   రంజాన్‌ పర్వదినం మొదటి శుక్రవారం ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో అల్లాని ప్రార్థిస్తూ  ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏలూరు నగరంతో పాటు మండ లంలోని వివిధ గ్రామాల్లో మసీ దుల్లో ముస్లింలు మసీదుల వద్దకు చేరుకుని అల్లాను ప్రార్థించారు. మౌలానా, బీడ్లా అందిం చిన మహ్మద్‌ ప్రవక్త సంకేతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో విన్నారు. ఉదయం, మధ్యాహ్నం ఈద్‌గా వద్ద ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకు న్నారు. దీక్షను సాయంత్రం విరమించారు. ప్రత్యేక వంట కమైన హలీమ్‌ను స్వీకరించారు. నగరంలోని పలు మసీదులను విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.   

Updated Date - 2021-04-17T05:06:35+05:30 IST