రొయ్యల చెరువులో విష ప్రయోగం

ABN , First Publish Date - 2021-01-16T05:51:02+05:30 IST

ఏలూరు రూరల్‌ మండలం శ్రీపర్రులో ఓ వ్యక్తి రొయ్యల చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు.

రొయ్యల చెరువులో విష ప్రయోగం
చెరువులో తేలిన రొయ్యలు

 ఏలూరు రూరల్‌, జనవరి 15 : ఏలూరు రూరల్‌ మండలం శ్రీపర్రులో ఓ వ్యక్తి రొయ్యల చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. గ్రామ శివా రులో అదే గ్రామానికి చెందిన జయ మంగళ రామ కృష్ణకు రొయ్యల చెరువు ఉంది. వీటిలో రొయ్యలు సాగు చేస్తున్నాడు.గురువారం మేత వేయడానికి వెళ్లగా చెరువులో రొయ్యలు చనిపోయి తేలిపోవడం గమనించాడు. అనుమానం వచ్చి చెరువు చుట్టూ పరిశీలించగా పురుగుల మందు డబ్బాలు, గుళికల సంచిని గుర్తించాడు. దీనిపై రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుమారు రూ.పది లక్షలు నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రూరల్‌ పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు.

Updated Date - 2021-01-16T05:51:02+05:30 IST