పేలిన పటాస్‌

ABN , First Publish Date - 2021-09-17T05:27:23+05:30 IST

వీరవాసరం మండలం రాయకుదురులో గురువారం రాత్రి ఒక ఇంట్లో బాణసంచాకు ఉపయో గించే పటాస్‌ పేలింది.

పేలిన పటాస్‌
ధ్వంసమైన భవనాలు

వీరవాసరం, సెప్టెంబరు 16: వీరవాసరం మండలం రాయకుదురులో గురువారం రాత్రి ఒక ఇంట్లో బాణసంచాకు ఉపయో గించే పటాస్‌ పేలింది. ఇళ్లల్లో అందరూ టీవీలు చూస్తుండగా ఒక్క సారిగా వినిపించిన పేలుడు శబ్దంతో ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక కంగారుపడ్డారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలిందేమో నని అనుకున్నారు. చివరకు ఒక భవనం గదిలో నిల్వ ఉంచిన పటాస్‌ పేలినట్టు గుర్తించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊరట చెందారు. రాయకుదురు బుదరాయుడు వీధి రామాలయం సమీపంలో బొరుసు సూర్యనారాయణ ఇంట్లో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తాకిడికి పటాస్‌ నిల్వచేసిన గది ధ్వంసమైంది. సమీపం లోని ద్వారా రామకృష్ణ భవనంతోపాటు పరిసర భవనాలు, ఇళ్లల్లోని గాజు వస్తువులు, తలుపులు, గృహోపకరణాలు దెబ్బతిన్నాయి. సూర్యనారాయణ కుటుంబం ఎంతో కాలంగా తాటాకు టపాకాయలు తయారు చేసి అమ్ముతుంటారని చెబుతున్నారు. రాయకుదురుతోపాటు పరిసర గ్రామాల్లో రొయ్యలసాగు చేసే రైతులు చెరువులపై వాలే కొంగలు, కాకులను బెదిరించటానికి వీరి నుంచి ఈ బాణసంచా కొనుగోలు చేస్తుంటారు. దీపావళి సమీపించడం తో పటాస్‌ ధర పెరుగుతుందని భావించి ఇంటి మెట్ల కింద ప్రత్యేకంగా ఉన్న గదిలో సుమారు 10 కేజీల వరకూ నిల్వ చేశారు. పాలకొల్లు సీఐ వెంకటేశ్వరరావు, వీరవాసరం ఎస్‌ఐ పైడిబాబు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 


 



Updated Date - 2021-09-17T05:27:23+05:30 IST