వైభవంగా కాళ్లకూరు వెంకన్న రథోత్సవం
ABN , First Publish Date - 2022-05-17T05:33:47+05:30 IST
కాళ్ళకూరులోని వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం సాయం త్రం స్వామి రథయాత్ర వైభవంగా సాగింది.
కాళ్ళ, మే 16: కాళ్ళకూరులోని వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం సాయం త్రం స్వామి రథయాత్ర వైభవంగా సాగింది. వేద మం త్రాల నడుమ, మేళతాళాలతో సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారు ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామికి ప్రత్యేక పూజలు చేసిన తర్వా త ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, డీఎన్నార్ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గోకరాజు నరసింహరాజు రథాన్ని లాగి ప్రా రంభించారు. వీధులన్నీ భక్త జనసంద్రంగా మారాయి. జువ్వలపాలెం రహదారిలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ దండు వెంకటకృష్ణంరాజు, ఈవో సత్యనారాయణరాజు, ధర్మకర్తలు పాల్గొన్నారు. కాగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైశాఖ పూర్ణిమ సందర్భంగా స్వామిని క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, అన్నపూర్ణమ్మ దంపతులు, కాళ్ళకూరు గ్రామస్థులు డాక్టర్ నీలాద్రిరాజు దర్శించుకున్నారు.