ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఓపీ సేవలు

ABN , First Publish Date - 2021-12-02T05:36:21+05:30 IST

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సాధారణ వైద్య సేవ లు ప్రారంభంకావడంతో అనేక మంది వచ్చి వైద్య సేవలను పొందారు.

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఓపీ సేవలు
డాక్టర్లతో చూపించుకునేందుకు వేచి ఉన్న రోగులు

ఏలూరుక్రైం, డిసెంబరు 1 : ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సాధారణ వైద్య సేవ లు ప్రారంభంకావడంతో అనేక మంది వచ్చి వైద్య సేవలను పొందారు. ఎని మిది నెలలుగా ఏలూరు ప్రభుత్వాస్పత్రి కొవిడ్‌ ఆస్పత్రిగానే ఉంది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్‌ ఎ.వి.ఆర్‌. మోహన్‌ సాధారణ వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకున్నారు. బుధ వారం ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో అన్ని విభాగాల్లో అవుట్‌ పేషెంట్‌ సేవలను కొనసాగించారు.  వైద్య సేవలు అవసరమైన రోగులను చేర్పించుకున్నారు.

Updated Date - 2021-12-02T05:36:21+05:30 IST