గణతంత్ర గణనాథుడు
ABN , First Publish Date - 2021-01-27T05:33:36+05:30 IST
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కుని మంగళవారం సత్రంపాడులోని శ్రీ లక్ష్మీగణపతి స్వామికి జాతీయ జెండా రంగులతో అలంకరణ చేశారు.
మూడు రంగులతో వినాయకుడికి అలంకరణ
ఏలూరుకార్పొరేషన్, జనవరి 26: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కుని మంగళవారం సత్రంపాడులోని శ్రీ లక్ష్మీగణపతి స్వామికి జాతీయ జెండా రంగులతో అలంకరణ చేశారు. జాతీయ పతాక రిబ్బన్ల దండలు వేసి కనకాంబరాలు, మల్లెపూలు, తులసీ దళాలతో జాతీయ రంగు వచ్చే విధంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించు కున్నారు.