డెంగీ కలకలం

ABN , First Publish Date - 2021-01-14T05:55:47+05:30 IST

డెంగీ ఇద్దరు యువతులను బలి తీసుకోవడంతో తాడేపల్లిగూడెం మండ లం ఎల్‌.అగ్రహారంలో తీవ్ర కలకలం రేగింది.

డెంగీ కలకలం

ఎల్‌.అగ్రహారంలో ఇద్దరు యువతుల మృతి

తాడేపల్లిగూడెం రూరల్‌, జనవరి 13 : డెంగీ ఇద్దరు యువతులను బలి తీసుకోవడంతో తాడేపల్లిగూడెం మండ లం ఎల్‌.అగ్రహారంలో తీవ్ర కలకలం రేగింది. నాలుగు రోజుల క్రితం ఏలూ రులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దంగేటి కృపావతి (20) డెంగీతోపాటు, షుగర్‌ పెరిగి, ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతో మృతి చెందింది. మంగళ వారం రాత్రి పోలిశెట్టి ధనలక్ష్మి(16)ని ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెం దింది. వరుసగా ఇద్దరూ తీవ్ర అనారో గ్యంతో చనిపోవడంతో గ్రామస్థుల్లో ఆందో ళన నెలకొంది. అప్రమత్తమైన వైద్యులు బుధవారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. ప్రజల రక్త న మూనాలు సేకరిస్తున్నారు. పలువురికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. పీహెచ్‌ సీ వైద్యాధికారి డాక్టర్‌ పి.రవికుమార్‌ మాట్లాడుతూ ఆ ఇద్దరు యువతులు జ్వరాన్ని అశ్రద్ధ చేయడం వల్ల.. ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి చనిపోయినట్టు చెప్పారు.


Updated Date - 2021-01-14T05:55:47+05:30 IST