లెక్కింపు ఎప్పుడో.. అభ్యర్థుల నిరీక్షణ!
ABN , First Publish Date - 2021-04-11T05:12:31+05:30 IST
పరిషత్ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. లెక్కింపు వ్యవహారం కోర్టులో ఉండడంతో ఎప్పుడు జరుగుతుందో తెలియదు.
ఏలూరు రూరల్, ఏప్రిల్ 10: పరిషత్ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. లెక్కింపు వ్యవహారం కోర్టులో ఉండడంతో ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఫలితంగా అభ్యర్థులు తమ భవి తవ్యం కోసం వేసి చూడక తప్పడం లేదు. ఏలూరు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు, జడ్పీటీసీ స్థానం ఉండగా జడ్పీ టీసీ స్థానంతో పాటు నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఏడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ అధిష్ఠానం ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినా అన్నిస్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మాత్రం బరిలో నిలిచారు. దీంతో ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని భావించినప్పటికీ గట్టి పోటీ ఎదురవ్వడంతో వైసీపీ అభ్యర్థుల్లో ఫలితాలపై ఉత్కంఠ మొదలైంది. ఓటింగ్ శాతం తగ్గడం వీరిలో కలవరానికి కారణమైంది. దీంతో ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురుచూడాల్సి పరిస్థితి నెలకుంది.