కరోనా దూకుడు

ABN , First Publish Date - 2021-05-17T04:51:56+05:30 IST

పెరుగుతున్న కేసులు

కరోనా దూకుడు

 ఉంగుటూరు...11

ఉంగుటూరు, మే 16: ఉంగుటూరు మండలంలో ఆదివారం 11 కరోనా కేసులు నిర్థారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. కైకరం 2, యర్రమళ్ళ 2, నాచుగుంట (కొత్తగూడెం)2, రాచూరు 2, నీలాద్రిపురం 1, నారాయణపురం 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు చేబ్రోలు, కాగుపాడు వైద్యాధికారులు డాక్టర్‌ వర్మ, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌లు వివరించారు. కాగా తల్లాపురలో కరోనా కేసులు పెరుగుతుండడంతో సర్పంచ్‌ పసుపులేటి నరసింహారావు ఆధ్వర్యంలో గ్రామంలో సూపర్‌ శానిటేషన్‌ చేయించారు.

 నిడదవోలు...59

నిడదవోలు, మే 16: నిడదవోలు పట్టణ మండలంలో ఆదివారం ఒక్కరోజే 59 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. పట్టణంలో 46 కేసులు, మండలంలోని గోపవరం 1, కాటకూటేశ్వరం 1, కోరుమామిడి 2, పందలపర్రు 1, పెండ్యాల 1, పురుషోత్తపల్లి 1, తాడిమళ్ళ 4, తాళ్ళపాలెం 1, తిమ్మరాజుపాలెం 1, మొత్తం 13 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.

 పెరవలి...14

పెరవలి, మే 16: కానూరు ఆరోగ్య కేంద్ర పరిధిలో 44 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 10 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. పెరవలి ఆరోగ్యకేంద్ర పరిధిలో 30 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. 

 ఉండ్రాజవరం...46

ఉండ్రాజవరం, మే 16: ఉండ్రాజవరం మండలంలో ఆదివారం 46 కరోనా కేసులు నమోదైనట్టు పీహెచ్‌సీ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. చిలకపాడులో ఆరు, చివటం5, దమ్మెన్ను1, కె. సావరం2, కాల్దారి 2, మోర్త4, పాలంగి8, పసలపూడి1, సూర్యారావుపాలెం1, సత్యవాడ 4, తాడిపర్రు1, ఉండ్రాజవరం11 కేసులు నమోదు అయ్యాయని ఆయన వివరించారు. 

 అత్తిలి...50

అత్తిలి, మే 16: మండలంలో 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని వైద్యాధికారి ప్రసన్నకుమారి తెలిపారు. అత్తిలి 41, మంచిలి పీహెచ్‌సీలో 9 కేసులు నమోదుఅయ్యాయని  తెలిపారు. 

 పెంటపాడు...82

పెంటపాడు, మే, 16: మండలంలో కొవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే ముదునూరు పీహెచ్‌సీ పరిధిలో 76, పెంటపాడు పీహెచ్‌సీ పరిధిలో 6 మొత్తం 82 కేసులు నమోదయ్యాయి. అలంపురం 19, ప్రత్తిపాడు 11, ఆకుతీగపాడు 11, కోరుమిల్లి 11, మీనవల్లూరు 9, వల్లూరుపల్లి 4, బీ.కొండేపాడు 4,  పెంటపాడు 3, ముదునూరు 3, రాచర్ల 3,  పరిమెళ్ళ 2, మౌంజీపాడు, దర్సిపర్రు  గ్రామాలలో ఒక్కో కేసు చొప్పున  నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

 తాడేపల్లిగూడెం... 39 

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 16: తాడేపల్లిగూడెం మండలంలో 39 కరోనా కేసులు నమోదైనట్టు తహసీల్దార్‌ అప్పారావు తెలిపారు. వీరిలో ఒకరు ఏరియా ఆసుపత్రికి, మరొకరు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు, మిగిలిన 36 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్టు వివరించారు. గ్రామాల్లో హైపోక్లోరైడ్‌ పిచికారి చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు అందిస్తున్నట్టు ఇన్‌చార్జి ఎంపీడీవో కొయ్యే వెంకట్రావు తెలిపారు. 

 భీమడోలు... 45  

భీమడోలు, మే 16: మండలంలో 45 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు ఎంపీడీవో శ్రీనివాస్‌ తెలిపారు. ఆగడాలలంక 11, భీమడోలు 6, దుద్దేపూడి 1, గుండుగొలను 17, పోలసానపల్లి 4, పూళ్ళ 3, సూరప్పగూడెం 3 కేసులు నమోదైనట్టు ఎంపీడీవో తెలిపారు.

 ఇరగవరం...25

ఇరగవరం, మే 16: ఇరగవరం, రేలంగి పీహెచ్‌సీల పరిధిలో ఆదివారం 25 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.    ఇరగవరం పీహెచ్‌సీ పరిధిలో 14, రేలంగి పీహెచ్‌సీ పరిధిలో 11 కేసులు నమోదైనట్లు వైద్యులు బంగారు రవి, వై.యశోద తెలిపారు. ఆర్‌టీ పరీక్షలు 78 మందికి నిర్వహించినట్లు పేర్కొన్నారు. కె.కెముదవల్లి గ్రామంలో 50 సంవత్సరాల వ్యక్తి కరోనాతో మృతిచెందాడని వైద్యులు తెలిపారు.


Updated Date - 2021-05-17T04:51:56+05:30 IST