ఐక్యతతో రాజ్యాధికారం సాధిద్దాం : జెట్టి

ABN , First Publish Date - 2021-07-30T04:59:38+05:30 IST

కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఐక మత్యంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతూ వచ్చే ఎన్నికల నాటికి బలో పేతమై రాజ్యాధికారం కోసం పోరాడుదామని కాంగ్రెస్‌ ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు జెట్టి గురునాథరావు పిలుపునిచ్చారు.

ఐక్యతతో రాజ్యాధికారం సాధిద్దాం : జెట్టి
సమావేశంలో మాట్లాడుతున్న జెట్టి గురునాఽథరావు

ఏలూరు కార్పొరేషన్‌, జూలై 29 : కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఐక మత్యంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతూ వచ్చే ఎన్నికల నాటికి బలో పేతమై రాజ్యాధికారం కోసం పోరాడుదామని కాంగ్రెస్‌ ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు జెట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ జిల్లా కార్యా లయంలో గురువారం జరిగిన ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీస్‌ నాయకులు, కార్య కర్తల సమావేశానికి ఏలూరు కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌ రావు అధ్యక్షత వహించారు. రాష్ట్ర బీసీ సెల్‌ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ బీసీలంతా సంఘటితమైతే వచ్చే ఎన్నికల్లో విజయం సాధి స్తామన్నారు. మైనార్టీస్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జనాబ్‌ దాదా గాంధీ మాట్లా డు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీల పట్ల వివక్ష చూపుతున్నాయన్నారు. ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎస్సీల్లో గత ప్రభుత్వాలు విభేదాలు సృష్టించి ఐక్యతను దెబ్బతీశాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి బురదకుంట క్రాంతి, కార్యదర్శి అమర్‌ జహ బేగ్‌, పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్‌ విభాగాలకు చెందిన నాయకులు, కార్య కర్తలు హాజరయ్యారు. 

Updated Date - 2021-07-30T04:59:38+05:30 IST