ట్రావెల్స్ బస్సు ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-01-21T05:17:22+05:30 IST
ప్రైవేటు ట్రావె ల్ బస్సు ఓ స్కూటీని ఢీ కొనడంతో ఒక యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు తీ వ్రంగా గాయపడ్డారు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఏలూరుక్రైం, జనవరి 20 : ప్రైవేటు ట్రావె ల్ బస్సు ఓ స్కూటీని ఢీ కొనడంతో ఒక యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు తీ వ్రంగా గాయపడ్డారు. విజయవాడ సమీపం లోని పోరంకికి చెందిన కాండ్రు దుర్గారావు ఇటీవల సంక్రాంతికి ఏలూరు మండలం పోణంగిలోని బంధువుల ఇంటికి వచ్చాడు.ఈ క్రమంలో బంధువులైన పోణంగికి చెందిన మరో ఇద్దరు యువకులు కాకొళ్ల దుర్గారావు (22), మత్తి ఆదినారా యణతో కలిసి స్కూటీపై బుధవారం రాత్రి ఏలూరు రైల్వేస్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్కు వచ్చారు. అర్ధరాత్రి దాటాక పోణంగి వెళ్లేందుకు పాత బస్టాండ్ కూడలి వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా విజయవాడ నుంచి విజయనగరం వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు బస్సు వీరి వాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అక్కడే గస్తీ విధులు నిర్వహిస్తున్న టూటౌన్ ఎస్ఐ నాగబాబు, సిబ్బంది క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కాకొళ్ల దుర్గారావు మృతిచెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ముగ్గురూ కూలి పనులు చేస్తుంటారు. టూటౌన్ ఎస్ఐ కిషోర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.