1500 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ
ABN , First Publish Date - 2022-08-13T05:44:40+05:30 IST
అజాదీ కా అమృత్ మహోత్స వంలో భాగంగా శుక్రవారం తణుకులో ఆర్వోబీ వద్ద నుంచి 1500 మీటర్ల జాతీయ జెండాతో ఎన్టీఆర్ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు.
తణుకు, ఆగస్టు 12 : అజాదీ కా అమృత్ మహోత్స వంలో భాగంగా శుక్రవారం తణుకులో ఆర్వోబీ వద్ద నుంచి 1500 మీటర్ల జాతీయ జెండాతో ఎన్టీఆర్ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. వివిధ విద్యాసంస్థలకు చెందిన 16 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు, హోంమంత్రి తానేటి వనిత, జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాసు, కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ ఎం.రవిప్రకాశ్ తదితరులు పార్కు వద్ద జాతీయ నాయకుల విగ్రహా లకు పూలమాలలు వేసి నివాళుర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విలువిద్యలో జాతీయ స్థాయిలో బంగారుపతకం సాధించిన సమీక్షను మంత్రి కారుమూరి అభినందించారు. సబ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, కమిషనర్ జి.సృజన తదితరులు పాల్గొన్నారు.