ముంబైలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వెస్ట్రన్ నేవీ
ABN , First Publish Date - 2020-04-10T03:08:48+05:30 IST
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికోసం వెస్ట్రన్ నేవల్ కమాండ్ ముంబైలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం...
ముంబై: లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికోసం వెస్ట్రన్ నేవీ కమాండ్ ముంబైలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. దాదాపు 500 ప్యాకెట్ల రేషన్ సరుకులను ప్రజలకు అందజేసింది. శనివారం కూడా 250 రేషన్ సరుకుల సంచులను ముసాఫిర్ ఖానా కలెక్టర్ కార్యాలయంతో పాటు స్థానిక అధికారులకు నేవీ కమాండ్ అందజేసింది. కఫ్ఫే పరేడ్, కల్వాదేవీ ప్రాంతాలలో ఈ ప్యాకెట్లను ప్రజలకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.