13 శాతం పడిపోయిన ఓటింగ్‌

ABN , First Publish Date - 2021-04-10T05:07:39+05:30 IST

పంచాయతీలకు.. పరిషత్‌లకు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గిపోయింది

13 శాతం పడిపోయిన ఓటింగ్‌

ఆకివీడులో పంచాయతీకి.. పరిషత్‌కు మధ్య తేడా

ఆకివీడురూరల్‌ ఏప్రిల్‌ 9 : పంచాయతీలకు.. పరిషత్‌లకు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గిపోయింది. సుమారు నెల రోజులు వ్యవధిలో జరిగిన ఎన్నికల్లో 13శాతం ఓటింగ్‌ తగ్గింది. మండలంలో  31,,681 ఓట్లు ఉండగా సర్పంచ్‌లకు జరిగిన ఎన్నికల్లో  26,808 ఓట్లు పోలై 84.85 శాతం నమోదైంది. అయితే పరిషత్‌ ఎన్నికల్లో మాత్రం 32,381 ఓట్లకు 23,278 ఓట్లు పోలై 71.85 శాతం నమోదైంది. సుమా రుగా 13 శాతం ఓటింగ్‌ తేడా వచ్చింది. టీడీపీ ఎన్నికలను బహిష్క రించడం ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు.

Updated Date - 2021-04-10T05:07:39+05:30 IST